పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం..
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
◆ – తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని దేవరం పల్లి,చీలపల్లీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను,మరియు దేవరం పల్లీ గ్రామంలో డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఝరాసంఘం మండల అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని,రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద రూ.12000 ఎకరా నికి అందిస్తున్నామని తెలిపారు.

మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్,సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కేతకి దేవాలయం చైర్మన్ మల్లన్న పాటిల్,మాజీ యూత్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,మాజీ యం.పి.టి.సి హఫీజ్,మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,శామ్ రావు పాటిల్,అశ్విన్ పాటిల్,సంగమేశ్,శ్రీకాంత్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,అక్బర్,నథానెయల్,మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,ఇమామ్ పటేల్,ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ తదితరులు పాల్గొన్నారు.