ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు
వరంగల్, నేటిధాత్రి :
స్థానిక వరంగల్ జిల్లా ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ ని ప్రజాసంఘాల,విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ని కలిసి జిల్లాలో డిఎంహెచ్వో గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ లో మెరిట్ ఉన్న వ్యక్తుల వద్ద లంచాలు తీసుకోవడం,అంతేగాక పల్లె వెలుగు పోస్టింగ్ కోసం డాక్టర్ల నుండి డబ్బులు తీసుకోవడం, కంటి వెలుగు ప్రోగ్రాంలో ప్రతి యూనిట్ కు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసే దానిలో పూర్తిస్థాయిలో వాహనాలు కేటాయించకుండా అవినీతికి పాల్పడడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రి రెన్యువల్ కోసమని డాక్టర్ల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం జరిగింది, గ్రామాలలోని ఆర్ఎంపి ల వద్ద డబ్బులు వసూలు చేయడం, వీటన్నింటిలో బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, మరియు సూపర్డెంట్ లను వెంటనే సస్పెండ్ చేయాలని రెగ్యులర్ డిఎంహెచ్వో ను నియమించాలని కోరగా బదులుగా కలెక్టర్ 24 గంటల్లో విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు అనంతరం ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో…తడుగుల విజయ్ మాదిగ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బొట్ల నరేష్ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కల్లెపెల్లి సురేష్ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జి మాడ రంజిత్ టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడపాక రాజేందర్ డి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి రఫీ మైనారిటీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు.