నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని 2వ వార్డుకు చెందిన ముత్తినేని శ్రీనివాస్,18 వ వార్డుకు చెందిన కొండ్ర సదానందంలు మంగళవారం మరణించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎలకంటి విజయకుమార్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి, నర్సంపేట అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్, మాజీ వార్డు మెంబర్ గాజుల రమేష్, మెరుగు సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు లాక్కార్స్ రమేష్, బాణాల శ్రీనివాస్, శ్రీరామోజు మురళి, మహమ్మద్ బాబా, బైరీ మురళి గిరగాని రమేష్, రామగొని శ్రీనివాస్, కొల్లూరి రాజు, గడ్డమీది తిరుమల్, గండి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.