శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి.శివరాత్రి జాగరణ లో భాగంగా ఆయన అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో ఆలయంలో పూజలు జరిపారు.అనంతరం ఆయన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు.పలువురు గ్రామస్తులు గ్రామంలోని వల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్న గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశానని,గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేశానని అన్నారు.ఇకపై కూడా ప్రజల సుఖ సంతోషాలు అభివృద్ధి కోసమే తన కృషి ఉంటుందని తెలిపారు.
