నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్…

నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

వైస్ చైర్మన్ గా గంధం నరేందర్

అట్టహాసంగా ప్రమాణస్వీకార మహోత్సవం

మోడల్ నర్సంపేటగా అభివృద్ధి చేస్తా..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా..

ఛైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్ గా 25 వ వార్డు కౌన్సిలర్ పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గా 7 వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్ పర్సన్ వైస్ చైర్మెన్ లను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా
ఎన్నుకున్నట్లుగా రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఆథరైజ్డ్ అధికారి, నర్సంపేట ఆర్డీవో పోలం ఉమారాణి ధ్రువీకరించారు. నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్, వైస్ చైర్మన్, పాలకవర్గానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీ 30 స్థానాల్లో 21 సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఖ్య బలంతో ఛైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. అంతకు ముందు పాలకవర్గ సభ్యులచే నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ నూతన పాలక వర్గ సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం శాలువాలు పూల బొకేతో ఘనంగా సన్మానించారు.

 

మున్సిపల్ శాఖ అధికారులు,వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, పట్టణ ప్రజల ఆనందాలతో నర్సంపేట మున్సిపాలిటీ కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సంపేట పట్టణాన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పథకాలతో మోడల్ పట్టణంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల సంక్షేమ పథకాల అభివృద్ధిపై విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా పార్టీలకతీతంగా నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మాధవరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రజలు పట్టంకట్టారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులతో పాటు సంక్షేమ అభివృద్ధిని విశ్వాసంతో పూర్తిస్థాయిలో చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 25 వ వార్డు కౌన్సి లర్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ నామినేషన్ వేయగా 30 వార్డు కౌన్సిలర్ మాదాసి రవి ప్రతిపాదించగా నాలుగవ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి బలపరిచారు. వైస్ చైర్మన్ గా 7 వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ నామినేషన్ దాఖలు చేయగా 24వ వార్డు కౌన్సిలర్ బత్తిని రాజేందర్ ప్రతిపాదించగా 6 వ వార్డు పొన్నం నరసింహారెడ్డి బలపరిచారు. చైర్మన్ వైస్ చైర్మన్ ల పోటీకి ఎవరు లేకపోవడంతో వారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిని ఆర్డిఓ ఉమారాణి ప్రకటన చేశారు.

*మోడల్ నర్సంపేటగా తీర్చిదిద్దుతాం..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మోడల్ నర్సంపేట గా తీర్చిదిద్దుతానని ఛైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణంలోని అన్ని వార్డులలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల విలీనమైన గ్రామపంచాయతీలను పట్టణ స్థాయిలోనే అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే మాధవరెడ్డి లక్ష్యం అని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు పట్టణ ప్రజల అభివృద్ధికి భారం పెరిగిందని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.

 

తన చైర్మన్ పదవికి పూర్తిస్థాయిలో సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి, వార్డు కౌన్సిలర్లకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి,బానోతు నవీన్ నాయక్,బూస శిరీష,దొమ్మాటి రమ్య సంతోష్ గౌడ్,శివరాత్రి స్వామి,మండల శ్రీదేవి,

హనుమకొండ శ్రీధర్,జూలూరి రోజా రాణి గౌడ్,దొంగల రజిత తో పాటు నర్సంపేట ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version