తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

తుమ్మనపల్లి గ్రామంలో విద్యుత్ ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు.

జహీరాబాద్ నతి ధాత్రి:

ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామస్తులు తరచుగా విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ పేర్కొన్నారు. రోజుకు చాలాసార్లు విద్యుత్ కోతలు ఉండటం వల్ల గృహ అవసరాలు, రైతుల వ్యవసాయ కార్యకలాపాలు అంతరాయం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. [కీలక] సమయాల్లో కూడా సరైన విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులను వెంటనే సమస్యను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆయన కోరారు. గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version