Young Poet Honored at Ugadi Event
సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా యువ కవికి చిరు సత్కారం
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ హనుమాన్ దేవస్థానంలో సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళీధర్, అధ్యక్షులు జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నేరోజు రమేష్ మరియు మానేరు స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు చింతోజు భాస్కర్ నాయకత్వం వహించారు.ఈ వేడుకకు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా, డి.ఎస్.పి కట్రోజు నాగేంద్ర చారి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిసమ్మేళనం నిర్వహించడంతో పాటు ప్రతిభ కనబరిచిన కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి నాగేంద్ర చారి మాట్లాడుతూ,
“కలం పట్టిన కవులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను ఒక సైనికుడిలా ఎదుర్కొంటూ, నిద్రలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపే శక్తి కలవారు” అంతేకాకుండా ఇలాంటి యువకులు ముందుకు వచ్చి సమాజానికి సాహిత్యంతో రూపుమాపాలని అన్నారు.
అలాగే మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ,యువ కవి, రచయిత అంకారపు రవి
ని సత్కరించడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి యువ కవులను ప్రతిభలను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలు కవులు, రచయితలు పాల్గొని అభినందనలు తెలిపారు.
