మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.

మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం

 

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

సిరిసిల్ల జిల్లా లోని మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వా వసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం సినారే జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగినది. సభాధ్యక్షులుగా కందేపి రాణి ప్రసాద్ ముఖ్యఅతిథిగా నాగుల సత్యనారాయణ విశిష్ట అతిథిగా జూకంటి జగన్నాథం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడూరి అనిత రచించిన కవితా సంపుటిని జూకంటి జగన్నాధం గారు ఆవిష్కరించారు. రచయితకు పలువురు అభినందనలు తెలిపారు.
జూకంటి జగన్నాథం గారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కవి ప్రతిస్పందన ఉండాలి. తద్వారా ప్రజాస్వా సమస్యల ఉనికిని చాటుతూ కవిత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అని అన్నారు.

Ugadi

సభాధ్యక్షులు కందేపు రాణి ప్రసాద్ గారు మాట్లాడు ప్రజలు పర్యావరణాన్ని నష్టం చేయకుండా ఉండాలి.సామాజిక స్తాయి పురోగతి మరియు వ్యక్తిగత శాంతి సాధన కొరకు ప్రేరణ ఇవ్వాలి. సాహితీ రంగంలో మహిళలు రాణించాలని కోరారు. మారసం అధ్యక్షులు tv నారాయణ,కార్యనిర్వాక అధ్యక్షులు యేలగొండ రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్
మారసం సభ్యులు అంకారపు రవి,దూడం గణేష్, చిటికెన కిరణ్ కుమార్, మాడూరి అనిత, సభా నిర్వహణ శ్రీమతి, వందన సమర్పణ ఇడెపు సౌమ్య చేసారు. కవులు బూర దేవానందం, కామారపు శ్రీనివాస్, కరుణాకర్, పాలి, భాగ్యలక్ష్మి,,నరసింహులు,దేవయ్య, వెంకటరెడ్డి విద్యార్థులు లక్షణ అక్షిత సాయి సురేష్ సృజన్ కుమార్ అంగల శ్రీవాణి కవిత గానం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version