హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్…

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్హుడైన ప్రతి ఉద్యమ కారునికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ప్రకటించిన ఇంటి స్థలాలను ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియూజేఏసీ) ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెండ్యాల సుమన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై కేసులుఉండి జైలు పాలైన ఉద్యమకారులకి మొదటి ప్రాధాన్యత గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికి రెండవ ప్రాధాన్యత గా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సోమవారం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు,పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హామీల అమలుకు 8 వారాలు సమయమిచ్చిన హైకోర్టు అందుకు ఉద్యమకారులు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు,పెన్షన్లు మంజూరు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడం ఫైటర్ శాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమ జేఏసీ నాయకులు దీనిపై విచారణ జరిపి అర్హులైన ఉద్యమకారులకు 8 వారాల్లోగా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు
ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా టీయూజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని సుమన్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version