నర్సంపేట/ దుగ్గొండి/ నేటిధాత్రి :
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జోరు దూసుకుపోతున్నది. గత మూడు రోజులుగా డి ఆర్ ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుగా నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ శైలు ప్రచారాన్ని జోరుగాకుండా కొనసాగిస్తున్నారు.
# దుగ్గొండి మండలంలో ప్రచార జోరు…
నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో వాడవాడనా గడప గడపన జోరుగా ప్రచారాన్ని చేపట్టగా మండలం పార్టీ అధ్యక్షులు సుగుణ రాజేశ్వరరావు, ఎంపీపీ కాట్ల కోమలభద్రయ్య ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దన్న గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి చెప్పుతూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచార జోరును కొనసాగించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నేరేడు మురళి, గ్రామ సర్పంచ్ విజేందర్, ఎంపీటీసీ రంపిస సొనీరతన్, గ్రామ పార్టీ యువత అధ్యక్షులు జన్ను మనోజ్, నాయకులు మంద ఐలయ్య,శాంతి కుమార్, భాస్కర్, తౌడు రవి, కనుగుల రమేష్ ,సంతన్,సుధాకర్,నరేష్, సందీప్,నరసింహస్వామి,చింటూ, పవన్,బాబు,రాంబాబు,అశోక్, కార్యకర్తలు యూత్ నాయకులు పాల్గొన్నారు.
# నర్సంపేట పట్టణంలో…
పెద్దిని గెలిపించుకుంటాం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం అంటూ నర్సంపేట పట్టణంలోని పదో వార్డు మెయిన్ రోడ్డులో ఇంటింటికి తిరుగుతూ స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. జిల్లా ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాల మంజూరు తెచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గుండెలో పెట్టుకొని చూసుకుంటామని కౌన్సిలర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఎదురబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, పస్తం ఎల్ల స్వామి, పస్తం కృష్ణ, శెర్ల శ్రీనువాస్, దోనాల రవి, వల్లాల జనార్ధన్, నాగిశెట్టి ప్రవీణ్,గ్యార శ్రీకాంత్, పస్తం హనుమంతు, పస్తం రాము , నాడం సాంబయ్య సార్, అవుల శ్రీకాంత్, మద్దెల రాజు, శీలం శ్రీను, చల్ల నారాయణ మానాగని సాంబయ్య కటకం లక్ష్మీనారాయణ, తుమ్మ ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.