ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం: రైతుల ఆనందోత్సాహాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బీ) గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు చెందిన ఓంకార్ చక్కెర్ కార్ఖానా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీని క్రషింగ్ ప్రారంభానికి సిద్ధం చేస్తూ యంత్రాలకు మరమ్మతులు చేపట్టారు. ఇటీవల ప్రత్యేక పూజలు నిర్వహించిన యాజమాన్యం, త్వరలో క్రషింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. ఫ్యాక్టరీ పునఃప్రారంభంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
