రక్తదాన శిబిరం విజయవంతం సామ్రాట్ సంజీవన్ మహారాజ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఇల్లందు డివిజన్ పరిదిలో డిఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలిస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లందు డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి ఆయా మండలాలకు సంబంధించి అనేకమంది పాల్గొనగా గుండాల మండల పరిది నుండి 25 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తల సేమియా పిల్లలు, బాధితులకు ఈ రక్తాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, స్పందన బ్లడ్ బ్యాంక్ వారు తెలియజేశారు. ప్రభుత్వ సహకారాల కోసం చూసే ప్రజలు నిరూపేదలు, బాధితులు బీసీ,ఎస్సి,ఎస్టీ ప్రజలే ఉన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ నిర్వహణలో బాద్యతలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన వారిని అభినందిస్తూ, అందుకుగాను పోలీసు వారు మా బృందానికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా గుండాలలో గతంలోనూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య క్యాంపులు, రోడ్ల మరమ్మత్తులు, చెద్దర్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తూ సామాజిక దృక్పథంతో, సేవానిబద్ధతతో, విధులు నిర్వహిస్తున్న గుండాల పోలీస్ అధికారి రాజశేఖర్ ను అభినందిస్తూ మిత్ర బృందంతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన, విద్యార్థి నాయకులు షాహిద్, ఆదివాసి రచయిత జర్నలిస్టు వుకే రామకృష్ణ , నలందాస్ నవీన్, పద్మారావు, ధనరాజ్, దార కృష్ణ, బాబురావు, బొమ్మెర శ్రీకాంత్, బానోతు నరేష్, షబ్బీర్, ప్రశాంత్, షారుక్, జగదీష్ మరికొందరు సోదరుల మిత్ర బృందానికి పేరుపేరునా ధన్యవాదాలు, అభినందనలు. ఈ దేశం మనది ప్రతి పౌరుడి భాగస్వామ్యమే గణతంత్ర భారతం. ప్రభుత్వ స్వచ్ఛంద కార్యక్రమాలలో పోలీసు వారితో, కార్యనిర్వహక, న్యాయ శాఖలతో, ఎన్నికల సంఘం, మరియు బీసీ, ఎస్సి,ఎస్టీ సమాజానికి ప్రాణం వంటి రాజ్యాంగ రక్షణకు దేశ పౌరులుగా స్వచ్ఛందంగా పని చేయలని, వాలంటీర్లుగా పౌర బాధ్యతతో వ్యవహరించే బృంద సభ్యులకు అభినందనలు తెలియజేస్తు పిలుపునిచ్చారు.