సీపీఎం నేత ఆకుల జనార్దన్ సేవలు మరువలేనివి
ఘనంగా ఆకుల జనార్దన్ 18వ వర్ధంతి వేడుకలు
గీసుగొండ,నేటిధాత్రి:
నిత్యం ప్రజా సమస్యల లక్ష్యంగా పనిచేసిన సిపిఎం పార్టీ నేత దివంగత ఆకుల జనార్దన్ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల నేతలు అన్నారు.గీసుగొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో సీపీఎం నాయకుడు ఆకుల జనార్దన్ 18వ వర్ధంతిని నాయకులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆకుల జనార్దన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గీసుగొండ మండల మాజీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు దాడి శివ, గంగాదేవిపల్లి సర్పంచ్ కూసం స్వరూప రమేష్, మాజీ సర్పంచ్ ఆకుల స్రవంతి, రుద్ర ప్రసాద్, కుటుంబ సభ్యులు, కుమార్తెలు, కోడలు తదితరులు పాల్గొన్నారు.
