వనపర్తి నేటిదాత్రి :
కలెక్టరేట్ శిక్షణ ఇవియం గోదాం నుండి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిపేరులో ఉన్న 28 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, 12 వివి ప్యాట్ లను ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య హైదరాబాద్ లోని ఈసిఐఎల్ కంపెనీకి పంపించారు. ఇటీవల జరిగిన మొదటి స్థాయి ఈవియం ల పరిశీలనలో వీటికి మరమ్మతు అవసరం ఉన్నట్లు గమనించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆర్ డి ఓ పద్మావతి రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఆర్.ఎస్. నుండి సయ్యద్ జమీల్ , ఎం. ఐ ఎం నుండి రహీమ్, తెలుగుదేశం నుండి కొత్త గొల్ల శంకర్, బి.జే.పి నుండి డి. ప్రవీణ్, కాంగ్రెస్ నుండి వేనాచారి, బి.ఎస్.పి నుండి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రిపెరులో ఉన్న ఇవియం ల ను ఈసిఐ.యల్ కు తరలింపు
