బోయినిపల్లి మండల కేంద్రంలో పోలీసు బలగాలు మోహరింపు
బి ఎస్ ఎఫ్ సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు….
వేములవాడ డిఎస్పీ: నాగేంద్ర చారి
రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ : కృష్ణకుమార్
బోయినిపల్లి,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండల కేంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా బిఎస్ఎఫ్ రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం రోజున బోయినిపల్లి,విలాసాగర్, నీలోజి పల్లి,కొదురుపాక వరకు కొనసాగిన ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఎటువంటి శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా
ఏర్పాట్లు చేస్తున్నామని, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని, త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు.జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లాలో మొత్తం 560 పోలింగ్ కేంద్రాలు ఉండగా,ఇందులో 118 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.
ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో బిఎస్ఎఫ్ కమాండెంట్, అదనపు కమాండెంట్, వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి,వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్,స్థానిక ఎస్సై మహేందర్, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.