ప్రయాణం…. ప్రమాదం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం మాందారి పేట కూడలి నుండి భూపాలపల్లికి పోయే తారు రోడ్డు గుట్టల వద్ద టైర్ యొక్క గుంతలు పడి అతి ప్రమాదకరంగా మారింది. పరకాల రహదారి మార్గంలోని మాందారిపేట-పరకాల రోడ్డు పైకి వస్తే వాహనదారులు భయభ్రాంతులకు గురై ప్రయాణం సాగిస్తున్నారు ఈ రహదారిపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది ముఖ్యంగా భారీ వాహనాల వల్ల రోడ్డు టైర్ గుంతలు పడి ప్రయాణం సాగడం నరక యాతన పడుతున్నారు వాహనాలు రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. చిన్న వాహనాలు ప్రమాదాలు జరిగి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు మార్గాన్ని సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు