కోనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో పర్మిషన్ తీసుకుని మూలవాగు నుండి ఇసుకను తరలిస్తుంటే పోలీసులు వేధిస్తున్నారని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు.పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్ ను రిలీజ్ చేసేంతవరకు ట్యాంక్ దిగనని నిరసన వ్యక్తం చేశాడు.ఈనెల 9నమండలంలోని కనగర్తి మూలవాగు నుండి నిజామాబాద్ గ్రామానికి చెందిన శోభన్ ట్రాక్టర్ ద్వారా డ్రైవర్ సహాయంతో పర్మిషన్ తీసుకొని ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్ నరేశ్ పట్టుకొని నంబర్ తప్పుగా ఉందని స్టేషన్ కు తరలించాడు. రెవెన్యూ అధికారులు నంబర్ తప్పుగా రాశారని వదిలిపెట్టాలని ఎంత చెప్పిన వినకుండా అక్రమంగా తనపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు.సంఘటన స్థలానికి ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి మరో చేరుకొని బాధితుని నచ్చజెప్పి ట్రాక్టర్ ను రిలీజ్ చేస్తానని హామీ ఇవ్వడంతో ట్యాంక్ దిగాడు.
పోలీసులు వేధిస్తున్నారని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
