శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం.

sri Kanthamaheswara sri Kanthamaheswara

కన్నుల పండుగగా శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం

నర్సంపేట నేటిధాత్రి:

నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ సూరమాంబ -శ్రీ కంఠ మహేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఐదు రోజుల పాటు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు.మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ, గౌడ కులస్తులకు మాలాదారణ, పటం కథ, రెండో రోజు గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు, మూడో రోజు జాలాభిషేకం, నాలుగో రోజు శ్రీ సూరమాంబ దేవి -శ్రీ కంఠ మహేశ్వరునికి కళ్యాణం,శ్రీ రేణుక-ఎల్లమ్మ తల్లి, జమదగ్ని పండుగ,బోనాల సమర్పణ, కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల భాగంగా బోనాల కార్యక్రమం లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరయ్యారు. శ్రీ కంఠ మహేశ్వరుని ఆలయంలో రేణుకా ఎల్లమ్మ,వనం మైసమ్మ,సూరమంబా దేవి, శ్రీ కంఠ మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనుషులు కట్ల సుధాకర్ గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్, కార్యదర్శి కక్కెర్ల కుమారస్వామి గౌడ్, కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్, కట్ల కనుకయ్య గౌడ్, మచ్చిక రవీందర్ గౌడ్, బూడిద రవీందర్ గౌడ్, బూడిద శివ కోటి గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు ఆరెల్లి వేణు గౌడ్, బోడిగే వినయ్ గౌడ్,మాజీ ఎంపీపీ మోతె పద్మ నాబరెడ్డి, మాజీ జెడ్పి టీ సి కోమాండ్ల గోపాల్ రెడ్డి, ఎంపిటీసీ వీరన్న నాయక్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ దుపాటి ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బోడిగే క్రాంతి గౌడ్, కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్, రంజిత్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!