జడ్చర్లలో తగ్గని జోరు…అదే హుషారు..

> బీజేపీల నుండి బీఆర్ఎస్ లో చేరిక.

> ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో నిరంతరంగా చేరికలు..

మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కార్యకర్తల హుషారు, నిరంతర చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుంది. అభివృద్ధి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అంటూ జెండాలన్నీ పక్కనపెట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి సంబంధించిన 10 మంది నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రానున్న 15 రోజులు చాలా కీలకమని ప్రతి కార్యకర్త నాయకుడు గత 9 ఏండ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. మరింత అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ప్రజలకు తెలపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!