వంట కార్మికుల బిల్లులు చెల్లించే వరకు సమ్మె విరమించం

రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ

16వ రోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె

డీఈవో, ఎంఈఓలకు వినతి పత్రాలు

భూపాలపల్లి నేటిధాత్రి

మధ్యాహ్న భోజన వర్కర్స్ పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించేంతవరకు సమ్మె విరమించేది లేదని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ అన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె 16వ రోజు కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా డీఈవో, ఎంఈఓ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో వంటలు చేసి వండి పెడుతున్న కార్మికులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. అప్పులు తెచ్చి వంటలు బండి పెట్టిన వర్కర్స్ అప్పుల పాలై దుర్భర జీవితం గడుపుతున్నారని వివరించారు. అట్లాగే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ విడుదల చేస్తున్నారే తప్ప కార్మికుల అకౌంట్లో డబ్బులు వేయడం లేదని మండిపడ్డారు. అకౌంట్లో వేయని డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయో తెలియదని ఆమె సూటిగా ప్రశ్నించారు. గతంలో కూడా బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పి ఇప్పటివరకు వారి అకౌంట్లో డబ్బులు వేయలేదని, మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా మధ్యాహ్న భోజన కార్మికుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేరళ తరహాలో మధ్యాహ్న భోజన కార్మికులకు 600 చెల్లించిన విధంగానే కార్మికులకు వేతనాలు చెల్లించాలని అట్లాగే గ్యాస్, కోడిగుడ్లు సరుకులను, ప్రభుత్వమే సప్లై చేయాలని కోరారు. వంటలు వండి పెడుతున్న కార్మికులకు ప్రభుత్వం ప్రమాదం జరిగిన కార్మికులకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని అట్లాగే అసెంబ్లీ సాక్షిగా పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని కొరిమి సుగుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సుగుణ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధికార ప్రతినిధి మెరుగు రమేష్, వంట కార్మికులు వరలక్ష్మి, స్వర్ణలత, మల్లమ్మ, రాజేశ్వరి, భవాని, భాగ్య, రజిని, రజిత, సరస్వతి, సుగుణమ్మ, పుష్ప, పద్మ, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!