విపక్షాల వైఖరి మారాలి

బలమైన ప్రతిపక్షానికి సహేతుక సిద్ధాంతం అవసరం

కలగూరగంప రాజకీయాల వల్ల ఒరిగేదేమీ వుండదు

 

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు

అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?

 

ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు

ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!

 

ఇదీ విపక్షాల ‘సెక్యులర్‌’ సిద్ధాంతం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ బలహీనంగానే వుంటూ వచ్చింది. కాంగ్రెస్‌కు సైద్ధాంతికంగా బలమైన ప్రత్యామ్నాయాలుగా వున్న కమ్యూనిస్టు పార్టీలు నేడు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అవినీతికి వ్యతిరేక పోరాటంలో పుట్టుకొచ్చిన ఆమ్‌ ఆద్మీపార్టీ, తె లంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి (తర్వాత బీఆర్‌ఎస్‌గా మా రింది) ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చతికిలపడటం తాజాపరిణామం. సైద్ధాంతిక దివాలకోరుత నంతో అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్‌ అంపశయ్యవైపు అడుగులేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ హింసారాజకీయమే దానికి ఊతంగా నిలుస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే దేశంలో విపక్షాలు యుద్ధంలో అన్ని ఆస్త్రాలను కోల్పోయి నిర్వీర్యమైన దుస్థితికి చేరుకున్నాయనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. ముఖ్యంగా విభిన్న సైద్ధాంతిక నేపథ్యాలు కలిగిన బలమైన ప్రతిపక్షాలు ఎంత బలంగా వుంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా మనుగడ సాగిస్తుందనేది ఒక అభిప్రాయం. కానీ స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి విప క్షాలు బలంగా ఉన్నది ఎప్పుడూ లేదు! బలంగా ఉన్న కొద్దికాలంలో అవి ప్రభుత్వాలను స్థిరంగా పాలన సాగించనివ్వనూ లేదు! ఈ రెండూ చెప్పడానికి విచిత్రంగా వున్నా, అక్షరసత్యం!

ఛరిష్మా రాజకీయాలు

ఏ రాజకీయ పార్టీ అయినా తాము నమ్మిన కొన్ని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు వారి ఆమోదం లభిస్తేనే దానికి మనుగడ వుంటుందనేది అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్‌పై స్వాతంత్య్రోద్యమ ప్రభావం వుండటంవల్ల అప్రతిహతంగా అధికారంలో కొనసాగగలిగింది. ఈ ఛరిష్మాముందు కమ్యూస్టుల సిద్ధాంతాలు పనిచేయలేదు. ఒకదశలో కాంగ్రెస్‌ను ఢీ అంటే ఢీ అనే స్థితి ఏర్పడినా స్వీయ తప్పిదాలు, అంతర్గత సైద్ధాంతిక విభేదాలు కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీకూడా సిద్ధాంత నేపథ్యం కంటే, నె హ్రూ, ఇందిరాగాంధీ ఛరిష్మాపైనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో పార్టీ కోటలు ఒక్కటక్కటిగా కుప్పకూలిపోవడం మొదలైంది. ఇక కమ్యూనిస్టులో పరిపాలనా పరంగా ‘లిబరల్‌’, ‘నియో`లిబరల్‌’ విధానాల మధ్య ఊగిసలాట వైఖరి కొనసాగింది.

అవినీతిపై పోరాటం, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాధాన్యతల ఆధారంగా కొనసాగే ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చే పార్టీల మనుగడ ఆయా పరిస్థితులు చక్కబడేంతవరకే వుంటుంది. ఆయా సమస్యలు తీరిన తర్వాత ప్రజలు సహజంగానే వాటిని మరచిపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలు తమకు కనీసావసరాలపై దృష్టిపెడతారు తప్ప మిగిలినవి వారికి పట్టవు. ఇవి అన్ని వర్గాలు, కులాలు, మతాలవారికీ ఒక్కటే కనుక ప్రస్తుతం రాజకీయ పార్టీలు ‘సంక్షేమం’ పేరుతో ఉచితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇవి ఒక పరిమితిని దాటిపోవడం తో అమలు చేయలేక అధికార పార్టీలు సతమతమవుతుంటే, మరోవైపు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడం వర్తమాన చరిత్ర! విపక్షాలు చేస్తున్న మరో తప్పిదమేమంటే ‘సెక్యులరిజం’ పేరు తో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం, మైనారిటీలను విపరీతంగా బుజ్జగించడం! ఇదికూడామెజారిటీ ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం! అదే ముస్లింలు లేదా క్రైస్తవులు బలీయంగా వుండి, హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో ఈ పార్టీల వైఖరి మైనారిటీలకు అనుకూలంగా వుండదు. ఈ రెండు నాల్కల ధోరణిని మెజారిటీ వర్గాలుగుర్తించడమే వాటి పతనానికి ప్రధాన కారణం

జాతీయవాదానికి కారణం

ఒక జాతిప్రజలు తమ సంస్కృతిాసంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని భయపడినప్పుడు, వారిలో జాతీయవాదం క్రమంగా పెరుగుతుందనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, జాతీయవాదం ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఒక జాతి తన మనుగడకు ప్ర మాదం వాటిల్లుతుందని లేదా మరొక సంస్కృతి తన అస్తిత్వానికే భంగకరంగా మారిందని భా వించినప్పుడు ఉద్భవించే జాతీయవాదాలు ప్రజాస్వామ్యంలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తాయి. ఐరోపా దేశాలు ప్రస్తుతం ఈ పోకడలకు గొప్ప ఉదాహరణ. మనదేశంలో జమ్ముాకశ్మీర్‌కు చెందిన నాలుగు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు స్వదేశంలోనే కాందిశీకులుగా బతుకులీడవా ల్సిన దుస్థితికి ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పాటు, సెక్యులర్‌ పార్టీల పక్షపాత, నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణం. సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలకు విసిగిన ప్రజలు క్రమం గా జాతీయవాద పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాదాపుగా ఇదే పరిస్థితి యూరప్‌ దేశాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడుతుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికా రంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ వుండేది. తర్వాతి కా లంలో స్వీడన్‌లో 12%కు, ఫిన్లాండ్‌లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సా మాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతాభావానికి చిహ్నం. ఈ పరిణామాలను మన దేశంలో కమ్యూనిస్టులతో సహా సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేవారు గుర్తించకపోవడం విచారకరం. 

ప్రాధాన్యత లేని అంశాలపై పోరు

పెట్టుబడిదార్లను, భూస్వాములను వ్యతిరేకిస్తూ ప్రాభవంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ రెండు అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవడమే. ఒక పెట్టుబడిదారు సంస్థను స్థాపిస్తే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్‌యూనిన్లు హక్కులకోసం పోరాటం తప్ప, బాధ్యతలపై దృష్టిపెట్టకపోవడంతోఅవి దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండల్లా మారిపోయి, చివరకు ప్రైవేటీకరణకు గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇక భూస్వామ్య వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతిదీ కార్పొరేటీకరణ జరుగుతున్న కాలం ఇది. జనాభా విపరీతంగా పెరిగి కమతాల విస్తీర్ణం కుంచించుకుపోతున్న నేప థ్యంలో ఎవరికీ కడుపునిండని దుస్థితి! ఈ నేపథ్యంలో ప్రజల ఆలోచనా విధానాల్లో సమూల మార్పులు వచ్చేశాయి. లాభదాయకమైన ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించడం మొదలవడంతో భూస్వామ్య వ్యవస్థపై పోరాటానికి విలువేలేకపోయింది. సాయుధపోరాటం పేరుతో వాపపక్షతీవ్రవాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. దీనికి తోడు ముస్లిం మత ఛాందస వాదం ప్రపంచ దేశాల అస్తిత్వానికే ప్రమాదకరంగా మారింది. అభివృద్ధి నిరోధకంగా, హింసను ప్రజ్వరిల్లజేస్తున్న ఈరెండు రకాల ఉగ్రవాదాలను కఠినంగా అణచివేయాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో వీటికి ప్రజలనుంచి మద్దతు లభించదు. వామపక్ష ఉగ్రవాద సమర్థకు లు ‘యుద్ధం’, ‘రణరంగం’ వంటి అతిపెద్ద పదాల ప్రయోగం చేస్తుంటారు. బలమైన వ్యవస్థతో సాయుధపోరాటం పనిచేయదన్నది ప్రపంచ వ్యాప్తంగా నిరూపితమైన సత్యం. తమ భావజాలాన్నిమార్చుకొని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే, ప్రజల్లో మద్దతుకోసం ముందుకు సాగవచ్చు. అసలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ తంత్రమే మారిపోయిన కాలమిది. ఇక ముందు ఆయుధాలు పనిచేయవు! అంతా డిజిటల్‌ పద్ధతిలోనే యుద్ధాలు జరుగుతాయి!

చరిత్ర ఒకప్రవాహం

చరిత్ర అనేది ఒక ప్రవాహం వంటిది. ఒక్కో కాలంలో ఒక్కో వాదం, సిద్ధాంతం బహుళ ప్రాచు ర్యం పొందుతాయి. ఒక కాలంలో ప్రధాన సమస్యగా వున్నది అనంతరకాలంలో కనుమరుగు కావచ్చు. ఎందుకంటే ఆ సమస్యపై ఆ కాలంలో జరిగిన పోరాటం విజయం సాధించడం వల్ల. ఆసమస్యకు పరిష్కారం లభించిన తర్వాత ఇక ఆ వాదంతో పనివుండదు. కానీ అదేవాదాన్ని పట్టుకు వేలాడతానన్న వారికి మనుగడ వుండదు! దళితవాదం, స్త్రీవాదం వంటి అనేక వాదాలు ఒకప్పుడు బహుళ ప్రచారం పొందడానికి ప్రధాన కారణం ఆయా వర్గాలు తీవ్ర అణచివేతను ఎదు ర్కొనడం! ఈ సిద్ధాంతాల నేపథ్యంలో జరిగిన సంఘర్షణ పుణ్యమాని వీరిపై అణచివేత తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆయావాదాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు క్రమంగా పురుషుల పైవేధింపులు పెరుగుతున్నాయి! మరిప్పుడు ‘పురుషవాదం’ రావాలా? పిల్లల్ని మేమెందుకు కనాలి? అనే ధోరణి క్రమంగా పెరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో సాంకేతిక సహాయంతో బిడ్డలను కనేరోజులు మొదలయ్యాయి! ఇంతటి మార్పు వస్తున్న తరుణంలో స్త్రీవాదం పనిచేస్తుందా? సామాజికంగా సమానత్వం పరిఢవిల్లుతున్న నేటి కాలంలో పేదరిక నిర్మూలన, ఉపాధికే ప్రాధా న్యత వుంటుంది తప్ప దళితవాదానికి ప్రాధాన్యత ఎక్కడ? హింసకు లేదా అత్యాచారానికి గురైన వ్యక్తి పేద లేదా మహిళ లేదా మరే ఇతరులైనా చట్టపరమైన న్యాయాన్ని పొందడానికి అర్హులవుతారు. పీడితుడికి కులం, మతం, ప్రాంతం అనేవి వుండవు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మహామహులు, తాము గొప్ప నాయకులనుకుంటున్నవారే జైళ్లకు వెళ్లే రోజులివి! 

విపక్షాల మార్కు సెక్యులరిజం

ఇంత విశ్లేషణ తర్వాత మనకు అర్థమయ్యేది ఒక్కటే! మెజారిటీ, మైనారిటీ, ధనిక, పేద అనే తే డా లేకుండా అందరికి సమానత్వం, సమాన న్యాయం జరగడమే సెక్యులరిజం. కానీ విపక్షాలు సెక్యులరిజం పేరుతో తమకు ప్రయోజనం వుంటుందనుకున్న వర్గాన్ని మాత్రమే వెనకేసుకొచ్చి, మరొక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. విపరీత స్థాయిలో బుజ్జగింపులకు పాల్పడుతున్నాయి. ఇదే వాటి పతనానికి ప్రధాన కారణం! ఓట్లకోసం సైద్ధాంతిక నిబద్ధతను గాలికొదిలేయడం విపక్షాలు వరుస పరాజయాలు ఎదుర్కొనడానికి మరో కారణం! నిజం చెప్పాలంటే మైనారిటీల పేరు తో ‘మతవాదాన్ని’ సమర్థిస్తున్నవి ఈ పార్టీలే. మెజారిటీ వర్గం మేల్కంటే, దాన్ని ‘మతోన్మాదమంటూ’ గగ్గోలు పెట్టడం వీటికి ఫ్యాషనైపోయింది. ఇప్పటికీ ఇవి తమ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదంటే, ఈ వాస్తవాన్ని ఇంకా గుర్తించలేదని అర్థం. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా, మనదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసుకోవడానికి అంగీకరించరు. అధికారం పొందడం మాత్రమే సిద్ధాంతంగా కలిగిన మిగిలిన పార్టీలు తమ విపరీత పోకడలను మార్చుకోరు. మనదేశంలో విపక్షాలు బలోపేతం కాకపోవడానికి ఇది మరో కారణం! లౌకికవాదం ముసుగులో రాజ్యాంగాన్ని హతమార్చి హిం దువులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ భయంకరమైన పాపాన్ని మూటకట్టుకుంది. 1975 నుంచి 1977 మధ్య 21నెలల పాటు ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయింది, నష్టపోయింది హిందువులే! దేశాన్ని తల్లిగా పేర్కొంటూ, మాతృప్రేమను పెపొందించేది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రమే! కులం, ప్రాంతం, భాష అనే కుంపట్ల మధ్య కునారిల్లుతున్న హిందువుల్లో తాము హిందువులమన్న జాగృతిని కలిగించింది కేవలం అయోధ్య రామమందిరం మాత్రమే. విభిన్న త్వం పేరుతో ప్రజలమధ్య విభేదాలు సృష్టిస్తూ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్న విపక్షాల కుచ్చిత నీతిని ప్రజలు గుర్తించడంవల్లనే వాటికి ప్రస్తుత దుస్థితి. నేడు ప్రజలు ఒక సత్యాన్ని బాగా గుర్తించారనుకోవాలి. ఏంటంటే సన్యాసులు (కర్మయోగులు) పాలిస్తే కోట్లరూపాయల మిగు లు బడ్జెట్‌ వుంటోంది. అదే సన్నాసులు (స్వార్థపరులు) పాలిస్తే అప్పులే గతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!