
Indiramma's
ఇందిరమ్మ ఇల్లు భూమి ముగ్గేసిన కార్యదర్శి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలో బంగ్లా గడ్డ పంచాయతీ పరిధిలోని కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరేశం పటేల్ మొహమ్మద్ అష్రఫ్ అలీ ఇస్మాయిల్ సాబ్ మొహమ్మద్ బషీర్ మొహమ్మద్ గౌసుద్దీన్, తదితరులు పాల్గొన్నారు