వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన మండల ప్రజలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని అన్ని గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో గత కెసిఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీటీ రోడ్లకు నిధులను మంజూరు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల మండలంలోని ముచింపుల తండా, రంగాపురం, దస్తగిరి పల్లి, అ ర్షణపల్లి, నాగరాజు పల్లి, మామిండ్ల వీరయ్య పల్లి, పంతులుపల్లి, చిన్న తండా గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూలతో స్వచ్ఛందంగా శాంతియుత పద్ధతిలో ప్రారంభం కానీ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది మండల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన నిధులు నిర్వీర్యం అవుతున్నాయని ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ వేసవి కాలం లోపే బీటీ రోడ్లు పూర్తయ్యే విధంగా కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మంజూరైన నిధులను వెనక్కి వెళ్లకుండా వెంటనే పనులను పూర్తి చేసి ప్రారంభించాలని ఆయా గ్రామ ప్రజలు కోరారు.