పంచాయతీ కార్యదర్శుల సమస్యలు .!

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎంపీడీవో కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు పంచాయతీ కార్యదర్శుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతి కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఓ ఇట్టి లేఖను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిఓ శ్రీపతి బాపు రావు,పంచాయతి కార్యదర్శులు సుమన్,సురేష్, సత్యనారాయణ,ఉదయ్ కుమార్,శ్రీనివాస్,ప్రశాంత్,సాయి కిరణ్,రమాదేవి,తిరుమల,సుప్రియ మరియు జూనియర్ అసిస్టెంట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version