రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు.!

Bhupalapally police. Bhupalapally police.

రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిబాబు సహా మరో ఇద్దరు అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన కొత్త హరిబాబు ఖాసింపల్లి , భూపాలపల్లి అను అతనిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబు పారిపోవడానికి సహకరించిన ములుగు జిల్లాకి చెందిన వట్టే రమణయ్య రమ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినారు. ఈ అరెస్ట్ నిమిత్తమై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీ, జైపూర్ ,ఆగ్రా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చివరికి నిందితుని ఆచూకీ తెలుసుకొని పోలీసులు అరెస్టు చేశారు.
ఇప్పటికే అరెస్టు అయిన నిందితులను మరల పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించి తదుపరి చర్య తీసుకోబడునని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఎస్సై సాంబమూర్తి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!