నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు…
గార్ల నేటి ధాత్రి:
భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి అధికారానికి నిజం చెప్పే నిర్భయ నాయకుడు నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గొంతు లేని వారిని శక్తివంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయాణం కొనసాగాలని సామాజిక న్యాయం, సమానత్వం మరియు హక్కుల కోసం నిర్భయంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కోట్లాదిమంది అణగారిన యువత, శ్రామిక ప్రజలకు ఆశా కిరణంగా ఉండాలని కోరారు.
