సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం..

The government's goal is the advancement of the underprivileged sections. The government's goal is the advancement of the underprivileged sections.

సబ్బండ వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఆమోదం తెలపడం చారిత్రక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదిస్తూ తీర్మానం చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిదర్శనం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు.గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం అభిషేకం నిర్వహించారు. అనంతరం మండలాధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ వర్గాల ప్రజలు ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బీసీ రిజర్వేషన్ బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. గతం పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీ బిల్లుకు అనుకూలం అంటూనే, అసెంబ్లీలో ఆమోదించకుండా నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని నాటి ప్రభుత్వం పూర్తిగా విస్మరిచ్చిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పురమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,రామిడి రాజిరెడ్డి,దోర్నాల శ్రీనివాసరెడ్డి, వేముల భాస్కర్, ఎస్సి సెల్ అధ్యక్షులు కొలెపాక స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దూలం వీరేశం, దీకొండ మధు, గరిగంటి కరుణాకర్, ముచ్చె శంకర్, తాళ్ల శ్రీనివాస్, పడాల రాజయ్య, గంగాధర సుదర్శన్, నాగేందర్ రెడ్డి, ఆముదాల రోహిత్ రెడ్డి, పెద్దోళ్ల రాజేశం, రామంచ రాజు, ప్రభాకర్, ఆనంద్, కరీం, దోమకొండ మహేష్, పిట్టల మల్లేశం, నగేష్, ప్రభాకర్, శ్రీనివాస్, కోలాపురం లక్ష్మణ్, కుమారస్వామి, అట్లా రాజిరెడ్డి, కముటం శ్రీనివాస్, రొండ్ల అనిల్,మ్యాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!