Government Should Build Indiramma Houses for the Poor: Rajayya Madiga
నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి
ఎమ్మార్పీఎస్ టీఎస్
జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
నిరుపేదలకు ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రములో నిరుపేదలకు ఇల్లు మంజూరు అయినా, చాలా మంది ఆర్థిక సమస్యల మూలంగా నిర్మించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొలతలు కూడా కొంత తగ్గించాలని,అదేవిదంగా ఎస్సి, ఎస్టీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ, మలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..
