కురిసిన వాన మెరిసిన రైతు.

కురిసిన వాన మెరిసిన రైతు….

◆: రైతుల మొహంలో ఆనందం…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల,పరిధిలో ఎట్టకేలకు పది పదిహేను రోజుల తరువాత వర్షం కురవటంతో రైతులు ఆనందంతో ఉన్నారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు అనందంతో రైతులు తమ తమ పోలాలల్లో ఆయా ఖరీఫ్ సీజన్ పంటలు పత్తి మొక్కజొన్న, సోయా,మినుము, పెసర పంటలు వేసి వారం నుండి రెండు వారాలు అవుతుంది. వర్షం మాత్రమే
అలికిన సనిపి లాగానే అంతా అంతా మాత్రమేనని నాటి నుండి వర్షం కురువకపోవడంతో పంటలు అంతంతగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పడుతు న్న వర్షాలతో రైతులకు మేలు కలుగుతుంది. అంతే కాకుండా కొంతమంది రైతులు ఎప్పుడు, ఎప్పుడు పత్తి మరియు సోయా తదితర పంటలు వేయడా నికి భూమిని కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పుడు వర్షాలు కురువడంతో రైతులు లక్షలలో పెట్టుబడి పెట్టి వర్షం కోసం చాలా వేచి చూడవలసిన అవసరం రావడమే కాకుండా వర్షాలు కురుస్తున్న నేల రైతుల మొహంలో చిరునవ్వులు పట్టరాని సంతోషం రైతులను కలిగించేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!