AIMIM Victory Key to Municipal Development: Sheikh Rabbani
ఏఐఎంఐఎం పార్టీ విజయంతోనే పురపాలక సంఘం అభివృద్ధి
◆-: ఎన్నికల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులకు ఆదరించండి :
◆-: ఏఐఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,పురపాలక సంఘం ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తే మున్సిపాలిటీలు గణనీయంగా అభివృద్ధి సాధిస్తాయని ఝరాసంగం ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ పక్షాన పెద్దఎత్తున ఓట్లు వేస్తే పట్టణాల అభివృద్ధికి ఓటు వేసినట్టే నని, జహీరాబాద్ పట్టణ, కోహిర్ పట్టణాల అభివృద్ధి కోసం పార్లమెంట్ సభ్యులు పార్టీ అధ్యక్షులు బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆశీస్సులతో అభివృద్ధి సాధిస్తాయని, పార్టీకి పట్టం కడితే వారు మరింత బాధ్యతాయుతంగా అభివృద్ధి చేస్తారని, కావున పట్టణ ఓటర్లు అభివృద్ధి, సమర్థతకు పెద్దపీట వేసి ఏఐఎంఐఎం పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని మండల అధ్యక్షులు షేక్ రబ్బాని కోరారు.
