జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్.

Collector Collector

జిల్లాలో వేగంగా జరుగుతోన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారుల చొరవ

25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మార్చి 31లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట మార్చి 18 నేటి ధాత్రి(మెదక్):

Collector
Collector

అనధికార లే అవుట్ ప్లాట్లు, అనధికార లే అవుట్ లను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31, 2025 లోగా క్రమబద్ధీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ.. ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ * తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 22,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయని, హౌస్ ఓనర్స్ కి మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని వివరించారు.

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

మిగిలిన దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువు లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలన్నారు.

ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్న నేపథ్యంలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ కోసం సంబంధించి ఏదేని సలహాలు కొరకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా మునిసిపల్ సిబ్బంది ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఫోన్ కాల్ చేసి ఈ నెల 31లోపు.. 25 శాతం రాయితీని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ సేవలను పొందవచ్చునని, మార్చి 31 లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయకేంద్రం నంబర్ 9154293341, .అలాగే రామాయంపేట పురపాలక సహాయ కేంద్రం నంబర్ 9963290800 లలో సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!