దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు.

IT Minister Duddilla Sridhar Babu. IT Minister Duddilla Sridhar Babu.

అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం వారు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

 

 

ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్న రామగిరికృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. డాక్టర్. ఏ శ్రీనివాస్ హెడ్ కెవికె. డాక్టర్ అర్చన ఎస్ఎంఎస్ అనిమల్ హస్బండ్రీ. డాక్టర్. నీరజన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐ సి ఏ ఆర్ హైదరాబాద్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ. ఐటి శాఖ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా రైతులకు సాధారణంగా ఎప్పుడు వేసి వరి పంట కాకుండా ఇతర కూరగాయలు . మరియు చిరుధాన్యాలు పప్పు దినుసుల పంటలు సాగు చేస్తూ రైతులు మంచి లాభాలు ఆర్జించి ఆర్థికంగా ఎదగాలని మరియు పెరటి కోళ్ల పెంపకం. పౌల్ట్రీ ఫార్మ్స్ ద్వారా. మరియు గొర్రెలు, ఆవులు, బర్రెలు. పెంచి వాటి ద్వారా ఆర్థికంగా రైతు లాభం పొందవచ్చని ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామాన్ని మూడు సంవత్సరాలు దత్తత తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు శ్రీనివాస్ తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలేఖ , సెక్రటరీ మల్లేశ్వరి, విద్యా కమిటీ చైర్మన్ చిగురు స్రవంతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో డైరెక్టర్ పోతు పెద్ది రమణారెడ్డి.రైతులు మహిళా రైతులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!