బాలిక కుటుంబానికి 50లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.
ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మహా ముత్తారo మండలంలో
విలేకరుల సమావేశంలో ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ.పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులలో తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్రాల్లో ఉండే కార్మికులను తీసుకొచ్చి ఇలాంటి నిబంధనలు పాటించకుండా పరిచయం చేసుకుంటున్నా యాజమాన్యాలు అక్కడ ఏం జరిగినా పట్టించుకోని అధికారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది అయినా కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు.
గత సంవత్సరం ఇటిక బట్టీలలో బాలిక పైన ఇదే రకమైన దుశ్చర్య జరిగింది అయినా అధికారులు పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో నేరస్థులకు భయం లేకుండా పోతుంది
ఇతర రాష్ట్రం నుండి కార్మికులను తీసుకువచ్చినప్పుడు వారికి సంబంధించిన వివరాలు సంబంధించిన అధికారుల వద్ద పోలీస్ సిబ్బంది వద్ద లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి యాజమాన్యాల పైన నిందితులపైన వెంటనే కేసు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి బాలికను అత్యాచారం చేసి , హత్య చేసిన నిందితుణ్ణి ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించి వారి కుటుంబానికి 50లక్షల ఎక్ష్ గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని రైస్ మిల్లు యాజమాన్యాల పైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు .