నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనానికి బ్యాలెన్స్ పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల మున్నూరు కాపు సంఘ నాయకులు పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాములు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ను కోరగా దానికి స్పందించిన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీని మున్నూరుకాపు సంఘ నాయకులకు అందజేయడం జరిగింది. తక్కువ సమయంలోనే నిధులు మంజూరు చేసిన బండి సంజయ్ కుమార్ కు దీనికి సహకరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్, బిజెపి నాయకులు పుల్లెల రాములకు మున్నూరు కాపు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు బొడ్డు బాలయ్య, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, కటకం తిరుపతి, కొట్టే భూమయ్య, కొలుపుల మోహన్, పుల్లెల జగన్ మోహన్, పుల్లెల రాము, బొడ్డు భాస్కర్, గుండ వెంకటేశం, కొలుపుల వేణు, దొగ్గలి శ్రీనివాస్, దొగ్గలి నరేష్, పుల్లెల సాయి, పుల్లెల హిమాన్షు, తదితరులు పాల్గొన్నారు.