పది లారీలు, రెండు ప్రొక్లైయిన్ లకు అనుమతి
పరిమిషన్ లేని లారీలలో అధికారుల వాటాలెంత?
రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రక్క గ్రామ నీటి ట్యాంకర్ ద్వారా రోడ్డుపై నీటిని చల్లుతున్న వైనం
కరీంనగర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం రెవెల్లి గ్రామ చెరువులో మట్టి తవ్వకాలు జరిపేందుకు రంగాపూర్ గ్రామం పెద్దపల్లి మండలం మరియు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన ఏఎన్ఆర్ బ్రిక్స్ కు గ్రామపంచాయతీ వారు మే రెండున తీర్మానం అందించగా, ఇరిగేషన్ అధికారులు మే8న అనుమతులిచ్చారు. నిబంధనల ప్రకారం రెండు వేల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తరలించాలని, తవ్వకాల కోసం రెండు ప్రొక్లెయిన్ మట్టి తరలింపు కోసం పది లారీలను మాత్రమే ఉపయోగించాలని, ఉదయం 6 నుండి సాయంత్రం 6 తీసుకోవాలని పర్మిషన్ లో పేర్కొన్నారు.

కాని మట్టి తరలింపు కోసం పర్మిషన్ పొందిన సదరు కాంట్రాక్టర్ నిబంధనలు ఏం చేయవు, అధికారులు పట్టించుకోరు అనుకున్నాడో ఏమో గాని, పరిమిషన్ లేని లారీలను వాడటమే కాకుండా రాత్రి ఆరు గంటల తర్వాత కూడా ఇష్టారీతిన మట్టి తరలింపు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా రాగంపేట గ్రామపంచాయతీ కి సంబంధించిన నీటి ట్యాంకర్ ను సంబంధిత కాంట్రాక్టర్ రేవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో మట్టి తరలిస్తున్న లారీలు వెళ్లే దారిలో నీటిని పట్టుతుండడం విశేషం. ఈవిషయమై రాగంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్ ను వివరణ కోరగా మేము ట్యాంకర్ ను ఎవరికీ ఇవ్వలేదని తెలియజేశారు.

తమ ఆధీనంలో ఉండాల్సిన ట్యాంకర్ పక్క గ్రామంలో నీటిని పడుతున్న ఏమీ తెలియనట్టు ఉన్నా పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మట్టి తవ్వకాలు చేపట్టిన సమయంలో పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై మండలంలోని ప్రజలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇట్టి విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించడానికి వెళ్ళగా పంచాయతీ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె కార్యాలయానికి ప్రతిరోజు ఆలస్యంగా వచ్చుచున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు.

ఇదే విషయమై గ్రామ ప్రత్యేక అధికారిని వివరణ కోరగా కార్యదర్శి పై ఎంపీఓకి ఆలస్యంగా వచ్చుచున్నారని తెలియజేశామని మరియు మట్టి తరలింపుపై ఎంపీఓకి సమాచారం అందజేశామని తెలియజేశారు.నిబంధనలు విస్మరించి అనుమతి లేని వాహనాల ద్వారా మట్టి తరలిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంత జరుగుతున్నా సదరు కాంట్రాక్టర్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.