షైన్ హై స్కూల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

షైన్ హై స్కూల్ లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

ఎస్ఐ రవళి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

షైన్ హైస్కూల్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని షైన్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ భానుచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవళి రెడ్డి హాజరయ్యారు అనంతరం మాట్లాడుతూ మన జీవితంలో రోడ్డు భద్రత చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ మనం స్కూల్, బయటికి వెళ్లడానికి తిరిగి ఇంటికి రావడానికి రోడ్లను ఉపయోగిస్తాం. అందుకే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అన్నారు
డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఎప్పుడూ పాటించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, అలాగే సీట్ బెల్ట్ లేదా సాల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం తాగి వాహానం నడపరాదు అని తెలిపారు. అనంతరం
పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ విద్యార్థులకి డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. స్రవంతి. అకడమిక్ ఇన్చార్జ్ ఎమ్. రాజేష్ కుమార్ ఉపాద్యాయ బృందం పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version