*పులిగోరు ఆధ్వర్యంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

*పులిగోరు ఆధ్వర్యంలో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

తిరుపతి(నేటిధాత్రి:

తిరుపతిలో క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బుధవారం గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం వద్దకు విచ్చేస్తున్న నారా లోకేష్ కు పులిగోరు మురళీకృష్ణారెడ్డి నేతృత్వంలో మహిళలు మంగళహారతులు ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు.టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డిని నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడున్న నాయకులను పార్టీ కార్యకర్తలను పలకరించారు.ఈ కార్యక్రమంలో ఆటోనగర్ చల్లా శంకర్ రెడ్డి,టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ రామదాసు ముని రామయ్య, గంగమ్మ గుడి మాజీ పాలకమండలి సభ్యులు గెంజి సుధాకర్ రెడ్డి,శరత్ చౌదరి దుశ్యంతు, శంకర్ రెడ్డి, నారాయణ దేవరాజులు, విజయశంకర్, భారతి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పులిగోరు ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ.
నారా లోకేష్ తిరుపతి పర్యటన నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,యువత నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version