భూపాలపల్లి లో విద్యార్థినిపై టీచర్ దాడి

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని బిట్స్ బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని హన్సికను చితక బాధిన ఉపాధ్యాయుడు
తల్లిదండ్రుల ఫిర్యాదు తో పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టరు జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ కుమార్
ఈ సందర్భంగా హన్సిక తండ్రి రాజేందర్ వివరాలు అడిగి తెలుసుకున్నాం జిల్లా విద్యాశాఖ అధికారి రామ్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని హన్సికపై పాఠశాల ఉపాధ్యాయుడు చితక బాధడంతో పాప హన్సికకు కంటి పై భాగం లో గాయం కాగా ఇంటికి వచ్చి విషయం తెలిపిందని ఈ క్రమంలో ఉపాధ్యాయున్ని అడిగితే తమకేమీ తెలియదని దాటేవేశారని, విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశామని తండ్రి రాజేందర్ తెలిపారు, బిట్స్ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చిందని పాఠశాలలో అనుమతులు లేకుండా పుస్తకాలు కూడా విక్రయిస్తున్నారని పుస్తకాల గదిని సీజ్ చేసామని విద్యార్థినిపై దాడి ఘటనపై పూర్తి విచారణ జరిపి పాఠశాలపై,ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని డిఇఓ శ్రీరామ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *