ఇండ్లనుండి బయటకు వెళ్ళేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
దుగ్గొండి ఎస్సై రణధీర్.
నర్సంపేట దుగ్గొండి నేటిధాత్రి:
వివిధ పనుల నిమిత్తం ఇండ్ల నుండి బయటకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దుగ్గొండి ఎస్సై రణధీర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
మీ మీ బంధువుల ఇండ్లకు గాని, తీర్థయాత్రలు గాని, ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లినప్పుడు మీ ఇండ్లకు తాళాలు వేసి పోయేటప్పుడు తలుపులకు సెంట్రల్ లాకింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు పడాలని మండల ప్రజలకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇండ్లలో చొరబడి అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఇంట్లో ఉండే విలువైన వస్తువులను తమతో పాటు తీసుకెళ్ళాలని లేనిపక్షంలో ఇంట్లో ఒకరు ఉండే విధంగా చూసుకోవలని ఎస్సై రణధీర్ తెలియజేశారు.