రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

Land problems Land problems

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

 

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతులు భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సదస్సు ఫారంలో వివరాలు పొందుపరిచి తహసిల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ.. మండలంలోని భూముల సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంలో వివరాలు నిశితంగా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!