పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ..

పరకాలలో ఏఐసీసీటీయూ నిరసన ర్యాలీ

పరకాల,నేటిధాత్రి

 

సార్వత్రిక జాతీయ సమ్మెను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పరకాలలో ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమని,అవి అమలైతే కార్మికుల హక్కులు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు నెరవేరకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ ర్యాలీలో ఏఐసీసీటీయూ తో పాటు ఏఐటియుసి అనుబంధ సంస్థ హమాలి యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించారు. కష్టపడి పనిచేసే కార్మికుల జీవితం ఎలా దుర్బరంగా మారుతోందో తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వాటిని వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.లేదంటే పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో స్తంభించిన బొగ్గు గనులు…

భూపాలపల్లిలో స్తంభించిన బొగ్గు గనులు!

​భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ప్రభుత్వం మొండిగా అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక లోకం భగ్గుమంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూపాలపల్లి కెఎల్పి 8 ఇంక్లైన్ వద్ద ఐఎన్టియుసి, ఏఐటియూసి, ఏఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు విధులను బహిష్కరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలతో హోరెత్తించారు.
​ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు కొమ్ముకాసేలా 4 కోడ్ లుగా మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. “ఈ చట్టాలు అమలైతే కార్మికులకు పని గంటల గ్యారంటీ ఉండదని, కనీస వేతనాలు అడిగే హక్కు కూడా కోల్పోతామని” వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తన పద్ధతి మార్చుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు .​కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలనీ,కార్మికుల సామాజిక భద్రతను కేంద్రం గాలికొదిలేసిందనీ, అన్నారు .రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెను సక్సెస్ చేశాయనీ, హక్కులను కాపాడుకునే వరకు విశ్రమించమనే నినాదంతో భూపాలపల్లి గని ప్రాంతం మారుమోగింది.
ఈ పోరాటంలో కార్మిక నాయకులు చంద్రగిరి శంకర్, సంగం శీను, గుడుగుల శంకర్, పులి కృష్ణ ,
​గాజర్ల హరికృష్ణ, కృష్ణారెడ్డి, ఈగ శీను,​లింగయ్య, రాము, భోగి రాజయ్య, వినోద్ వందలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version