ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, దూసుకుపోతున్న పదో వార్డ్ కౌన్సిలర్…

ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, దూసుకుపోతున్న పదో వార్డ్ కౌన్సిలర్

చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్

చేర్యాల నేటిదాత్రి

 

 

చేర్యాల మున్సిపల్ పరిధిలో పదో వార్డు లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చేర్యాల పదవ వార్డ్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రజల మనసును దోచుకుంటున్నారు తమ సొంత ఖర్చులతో బోరు వేయించారు పదో వార్డ్ లో తిలక్ నగర్,బత్తేపు వారి ఇండ్ల వద్ద ఎన్నో ఏండ్లుగా చాలా నీటి ఎద్దడి సమస్య ఉందని ఎన్నికలకు ముందు తెలుసుకొని గెలిచిన వెంటనే ఇక్కడ నీటి ఎద్దడి లేకుండా చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు వార్డు ప్రజలందరి సమక్షంలో బోరు వేశారు. నీటి కష్టాలు తీరుతున్నాయని ప్రజలు ,హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాల నర్సయ్య, వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా-శ్రీధర్, కౌన్సిలర్స్ నిమ్మ సుప్రజ-రాజీవ్,కమలాపురం గీతాంజలి-రమేష్,భూనాద్రి సురేష్ మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు కాసుల శ్రీనివాస్, ఔషర్ల కిషోర్ పచ్చిమడ్ల పరశురాం ఇప్పకాయల శ్రీకాంత్ వార్డు ప్రజలు పాల్గొన్నారు

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు..

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు

క్లీనింగ్ పట్ల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి, మురికి నీరు ఒకే దగ్గర ఉండటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో మురికి నీరు ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్రమైన పడుతుంటే వాటిని శుద్ధి చేసేందుకు గాని 4 రోజుల నుండి మున్సిపాలిటీ జేసిబి అడుగుతుంటే, ఆయిల్ మార్పించాలని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిఅంటున్నారని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పని ఏం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు అవసరైన పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించకూడా పనులు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version