ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకో వాలి
సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం హుస్సేన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఎడ్లస్వరూ ప- సుధాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, కార్మికుల హాజరు, పని నిర్వహణపై ఆ రా తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కార్మికులు సమ యానికి హాజరై, అప్పగించిన పనులను పూర్తిగా నిర్వహిం చాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లోనే పనులు ముగించుకోవాలని సూచిం చారు. అదేవిధంగా, ప్రతి కార్మి కుడి హాజరు సక్రమంగా నమో దు చేయాలని, పనుల్లో ఎలాం టి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వంఅంది స్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, మేటు వేణు పాల్గొ న్నారు.
