ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలి
మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు
దుగ్గొండి,నేటిధాత్రి:
99 రోజుల పాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పట్ల రేపటి నుండి నిర్వహించే గ్రామ సభలను ప్రోటోకాల్ ప్రకారంగా గ్రామ సభలు నిర్వహించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అన్నారు.బుధవారం దుగ్గొండి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు,గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో గ్రామ సభల నిర్వహణ పట్ల ఎంపిడిఓ లెక్కల అరుంధతి అధ్యక్షతన ఆవాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సమ్మక్క, ఎంపీఓ మోడెం శ్రీధర్ గౌడ్, ఎంఈఓ వెంకటేశ్వర్లు,ఎస్సై రణధీర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు,కార్యదర్శులు పాల్గొన్నారు.
