ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి…

ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి

* మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మూడు చింతలపల్లి పాలకవర్గం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని రంగాల్లో అభివృద్ధిని చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ లతో పాటు కౌన్సిలర్లు బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా మూడు చింతలపల్లి అభివృద్ధి కోసం అన్ని విధాల తోడ్పాటు అందించాలని పాలకవర్గ సభ్యులకు కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అనిత, మాజీ సర్పంచ్ ఇస్తారి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, మురళి గౌడ్, సంజీవ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version