తొలగించిన అర్బన్ ఏరియా ఆసుపత్రిని తిరిగి అందుబాటులోకి తెవాలి..
◆-: కౌన్సిల్ సమావేశంలో గాళంఎత్తిన కౌన్సిలర్..
◆-: అదేవిధంగా ఇళ్ల మొటేషన్లు అయ్యేలా కరెంట్ మీటర్ల కు పర్మిషన్లు అందేలా చూడాలి..
◆-: 35 వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రజలంద రికీ అందుబాటులో ఉండే ఆరోగ్య నిమిత్తం గత ప్రభుత్వం ఏరియా అర్బన్ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా రెండు మూడు నెలల క్రితం దాన్ని తొలగించడం జరిగింది. మంగళవారం నాడు మున్సిపల్ మున్సిపల్ సర్వసభ సమావేశంలో 35వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ప్రవీణబేగం కౌన్సిల్ లో గుర్తు చేస్తూ మళ్లీ ఆసుపత్రిని సద్వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కౌన్సిల్లో గాళం విప్పడం జరిగింది. అదేవిధంగా ఐడిఏయంటి కాలానికి సంబంధించిన నిరుపేదలు ఇండ్లు కట్టుకోగా వాటికి అసెస్మెంట్ లు కావచ్చు, రిజిస్ట్రే షన్లు కావచ్చు, కరెంట్ మీటర్లు ఇవ్వకపోవడం శోచ నీయకరమైన విషయమని, కావున వాటన్నిటిని పరి గణించి వాటిని కూడా మీ దృష్టిలో ఉంచుకొని వెంటనే అసెస్మెంట్ లు గానీ, రిజిస్ట్రేషన్లు గాని,మొ టేషన్లు గాని, ఐడిఎయంటి కాలనీలో ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటికి పర్మిషన్ ఇవ్వాలని యంపిని, మున్సిపల్ చైర్మన్ ను కమిషనర్ ను, కౌన్సిల్ సర్వసభ సమావేశంలో ఆమె కోరారు..
