కెసిఆర్ పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలే
ఒక విజన్ తో పాలించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రజా సంక్షేమాన్ని మరిచి పాలన సాగిస్తున్న అధికార పార్టీ
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం పత్రిక మిత్రుల సమావేశంలో బి ఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గపు ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ నజీర్ అహ్మద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రజా సంక్షేమ ప్రదాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఈ రాష్ట్ర రైతన్నకి కాలేశ్వరం అనే బృహత్తర ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా దాని నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గొలుసు కట్టు చెరువులకు నీళ్లు అందించి భూగర్భ జలాలను పెంచారని రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు నిరంతరం 24 గంటలు విద్యుత్ సరఫరా పండిన పంటలను ప్రభుత్వం పరంగా కొనుగోలు చేసి రైతుకు కష్టం లేకుండా చేసినారని దీనిని చూసి ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ నేతలకు నానా ఇబ్బంది పెట్టుకుంటూ లేనిపోని కమిషన్లు వేసి కేసులు పెట్టిన కోర్టుల చుట్టూ తిప్పుతూ చేసిన అభివృద్ధి పద్ధతిగా లేదని తిరస్కరించి ప్రజల్లో దుష్ప్రచారం నిర్వహిస్తుందని, ప్రభుత్వం వేసిన అర్జీలను హైకోర్టు గత పాలకుల తప్పులేదని తేల్చి చెప్పిందని. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంప పెట్టని కాలేశ్వరాన్ని ఏదో ఒక పిల్ల క్రాకులు వస్తే ఇది కూలిపోయిందని పనికిరాదని ప్రచారం నిర్వహిస్తూ ఎన్ని రోజులు ప్రజాసంక్షేమాన్ని మరిచి పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబెట్టారు. ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు రిటైర్డ్ ఎంప్లాయిస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు వారి ఆత్మహత్యలకు చావులకు దారి చూపెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి అన్ని వర్గాల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజాపాలనాన్ని కొనసాగిస్తున్నారని ఎండగట్టారు. అన్ని వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా తప్పుడు ప్రచారాలు నిర్వహించుకుంటూ గత పాలకులను నిందించడమే ఏకైక ఎజెండా గా పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని ఇప్పటినుంచి రైతులకు గాని ఉద్యోగస్తులకు గాని ఎలాంటి ఆపద వచ్చిన బి ఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుందని గంటపదంగా చెబుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చాలని నెరవేర్చకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని మండల పార్టీ కచ్చరిస్తుందని తెలిపారు. మొక్కజొన్న రైతులకు వారి మొక్కజొన్నలను కొని ఆదుకోవాలని మండల పార్టీ కోరుతున్నదని రైతులకు నిరంతరం విద్యుత్తు నీరు అందించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలుపాలని మండల పార్టీ కోరుతున్నదని ఆర్టీసీ కార్మికుల కోరికలను వెంటనే అమలు చేయాలని మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఒక్క ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించి వారికి ఆదుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు ఇచ్చివారి జీవితాలకు వెలుగు నింపాలని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు ఎలాంటి అపోహల గురి కాకుండా ధైర్యంగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, టౌన్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ వీరు నాయక్ , ఊకంటి యాకూబ్ రెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాటోత్ సుజాత హరినాయక్ రావుల వినయ్ రెడ్డి, ఆగే రాము ,దూదేపాక కృష్ణ ,మేకల శారద సురేష్ ,పైరాల శరత్ , పురం రాజమణి రమేష్ , సర్పంచులు ఈసం లక్ష్మీనారాయణ, ఎదరబోయిన సూరయ్య బాలాజీ,జ్యోతి శ్రీనివాస్ , మాజీ సర్పంచులు హరి రామ్ ముఖ్య నాయకులు పందుల సంజీవ తోట శీను బానోత్ వెంకన్న మాజీ ఎంపిటిసిలు కొమ్ము రాహులు, దుబ్బాక వెంకన్న , చందు, యనమల్ల ప్రభాకర్ ,రాయుడు కూన భద్రాద్రి, లింగాల పిచ్చయ్య, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
