సెస్ యధావిధిగా కొనసాగించాలి జిల్లెల్ల గ్రామపంచాయతీ తీర్మానం….

సెస్ యధావిధిగా కొనసాగించాలి జిల్లెల్ల గ్రామపంచాయతీ తీర్మానం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రజల ఆధ్వర్యంలో.సెస్.ను యధావిధిగా కొనసాగించాలని పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో తీర్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఉమ్మడి.కరీంనగర్ జిల్లాలో. అలాగే దేశంలో ప్రత్యేక స్థానం పొందిన మనవిద్యుత్ సహకార సంఘం ఏర్పడి కొన్ని దశాబ్దాలు గడుస్తున్న. ఇప్పటివరకు రైతులకు ప్రజలకు గృహ అవసరాలకు విద్యుత్ అందిస్తూ. ప్రజలకు రైతులకు. పంటలకు. విద్యుత్ అందిస్తూ. 24 గంటలు సరఫరా నిలిపి.వేయకుండా విద్యుత్ అందిస్తున్న దేశంలోని.ఏకైక సంస్థ. మన విద్యుత్ సహకార సంఘం. సెస్. అని. అటువంటి విద్యుత్ సాహకార సంస్థ సంఘాన్ని.T.G.N.PDCL.సెస్.ను. విలీనం చేయరాదని జిల్లెల్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశామణి ఈ సందర్భంగా తెలియజేశారు కావున దయచేసి ఈ సంస్థను ఇలాగే యధావిధిగా కొనసాగించాలని ఇదివరకు ఉన్నట్టుగా సేవలందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్. రజిత రమేష్.పంచాయతీ పాలకవర్గం రైతులు ప్రజలు. BRS. పార్టీ నాయకులు. మాట్లమధు. దుబ్బాక రమేష్.నర్ర.సతీష్ రెడ్డి. అబ్బాయి అనిల్ రెడ్డి. MD. తాజుద్దీన్.బోల్గంశ్రీనివాస్. మాదారపు.సత్తిరెడ్డి.నర్ర నరేందర్ రెడ్డి. నరేష్. దేవయ్య. నర్సిరెడ్డి. అశోక్. లడ్డు తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రోడ్డుపై వంటావార్పు…

విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రోడ్డుపై వంటావార్పు

భూపాలపల్లి నేటిధాత్రి

ఆర్టిజన్ ఆన్ మ్యాస్ కార్మికుల ధర్నా ఉదృతం సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకువెళతాం డిమాండ్ చేసిన కార్మికులు
విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద వంట వార్పు నిర్వహించిన ఆర్టిజన్, ఆన్హ్మాన్ కార్మికుల ధర్నా కార్యక్రమం ఉదృతంగా కొనసాగింది. టీవీఏ జేఏసీ చైర్మన్ నాగుల తిరుపతి రెడ్డి కన్వీనర్లు మొత్కూరి. కోటి, తిప్పరపు రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు డివిజన్ల నుండి సుమారు మంది కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ యల్లా సురేందర్ రెడ్డి హాజరైనారు. విద్యుత్ సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని తెలిపారు ఆర్టిజన్ కార్మికులకు ఒక సర్వీస్ రూల్స్ ఓఎన్ఎమ్ కార్మికులకు ఒక సర్వీస్ రూల్స్ అమలు పరుస్తున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఈ విధానం నడుపుతున్నారు. తక్షణమే విద్యా అర్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులు అందర్ని ఏపీఎస్ఈబి రూల్స్ తో కన్వర్జన్స్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే తెలంగాణాలో రెండు డిస్కౌంలు ఉన్నాయి. ఒకటి. ఎస్పీడీసీఎల్ రెండవది ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లో అన్మాన కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించారు. ఎన్పీడీసీఎల్ లో గుర్తించలేదు ఇది ఎక్కడి న్యాయం ఎస్పీడీసీఎల్ లో అన్మాండ్ కార్మికులను ఆర్థికంగా గుర్తించినట్లు ఎన్పీడీసీఎల్ లో గుర్తించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మా న్యాయమైన కోరికలు నెరవేర్చకపోతే ఇప్పటికీ సమ్మ నోటీసు ఇచ్చినాము ఎన్పీడీసీఎల్ ధర్నా అనంతరము ఏ క్షణం ఐనా సమ్మెకు పోతామని తెలిపారు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణా విద్యుతు జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు కన్వక్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక భారం పడినటువంటి సమస్యలు రాష్ట్రంలో ఏమి ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు విద్యార్హతల ఆధారంగా ఏపిఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ తక్షణమే స్వరన్ చేపట్టాలని డిమాండ్ చేశారు గతంలో వచ్చిన ఎన్ ఎంఆర్ విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ వ్యవస్థ తీసుకు వచ్చివిద్యుత్ సంస్థలో ఎట్లా విలీనం చేసుకున్నారో తెలిపారు జిల్లా కన్వీనర్ మొత్కూరి కోటీ, తిప్పరపు రాజు మాట్లాడుతూ, ఎన్సీడీసీఎల్ పరిధిలో సుమారు 1600 మంది ఆన్ల్మ్యైన్ కార్మికులు అన్యాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్లో అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించి, ఎన్పీడీసీఎల్లో కూడా ఆన్మ్యన్ కార్మికులను ఆర్టిజన్ గుర్తించాలని తెలిపారు అలాగే మీటర్ రీడర్స్ పీస్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే, 4తారీఖున జెన్ కో గేట్ పాల్వంచ్ లో ధర్నా కార్యక్రమం చేసి మానిరసన తెలుపుతామన్నారు. అనంతరం ఏడో తేదీన ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టి, ఎనిమిదో తేది నుండి నిరవధిక సమ్మెలోకి దిగుతామని కఠిన హెచ్చరిక జారీ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ క్షణమైన సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు.
విద్యుత్ ఆర్టిజన్ ఆన్ మ్యాన్ కార్మికుల ధర్నాకు సంఘీభావంగా ఐఎన్ టియుసి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కట్ల సదయ్య ప్రధాన కార్యదర్శి నిమ్మల మల్లేష్ తెలిపారు అనంతరం వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ ధర్నాలో ఆర్టిజన్ అన్మాండ్ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు…

ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నూతన సంవత్సరం సందర్భంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన మాదిగ ఉద్యోగులు
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ నందిపాటి భాస్కర్, సీనియర్ కెమిస్ట్ మోతే తిరుపతి ల ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్, అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాడూరి రఘుపతి వారి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత సమస్యల పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కెటిపిపి మాదిగ ఉద్యోగులు చీఫ్ కెమిస్ట్ కె. నాగయ్య, పి. శేఖర్ ఎ.ఇ. ప్రవీణ్ ఎ.ఇ. గొపి ఎ.ఇ. కొడెపాక రత్నాకర్, చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, అల్లూరి శ్రీనివాస్, బిరెల్లి రాజు, బొచ్చు శంకర్, రమేష్, విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కార్మికులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version