ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు…

ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన జెన్కో మాదిగ ఉద్యోగులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నూతన సంవత్సరం సందర్భంగా చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన మాదిగ ఉద్యోగులు
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ నందిపాటి భాస్కర్, సీనియర్ కెమిస్ట్ మోతే తిరుపతి ల ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్, అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాడూరి రఘుపతి వారి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత సమస్యల పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కెటిపిపి మాదిగ ఉద్యోగులు చీఫ్ కెమిస్ట్ కె. నాగయ్య, పి. శేఖర్ ఎ.ఇ. ప్రవీణ్ ఎ.ఇ. గొపి ఎ.ఇ. కొడెపాక రత్నాకర్, చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, అల్లూరి శ్రీనివాస్, బిరెల్లి రాజు, బొచ్చు శంకర్, రమేష్, విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కార్మికులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version