నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని,

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని, అగ్రవర్ణ అహంకారం తో రజక కుటుంబం పైన దాడి చేసినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం రజక సంఘం సభ్యులు డిమాండ్ చేసారు.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో 18వ తేది నాడు నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కుటుంబం పై జరిగిన హేయమైన చర్యను నిరసిస్తూ. రెండు నెలల పాప, ముక్కుల పచ్చలారని పసికందును చంపడం.గుడిళ్ళోకి వంద రూపాయల రుసుము చెల్లించే దర్శనం చేసుకొని పోవాలని ఒక నియమంని పాటించాల్సిందని రజక కులాస్తురాలైన మూడు నెలల పాపను మరియు ఆ కుటుంబాన్ని విపరితమైన పదజాలంతో తిడుతూ వాళ్లపై చేయి చేసుకున్న సందర్భంలో ఆ యొక్క పాపను కూడా కొట్టి చంపడం జరిగింది. దాని నిరసిస్తూ ఈరోజు చందుర్తి మండల సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ రెడ్డిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇటు పోలీస్ శాఖను అటు న్యాయ శాఖను మరియు హ్యూమన్ రైట్స్ ని ఈ రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క దుండగులను వెంటనే శిక్షించి జైల్లో పెట్టాలని చందుర్తి మండలం రజక సంఘం కోరుకుంటుంది అలాగే ఈ హేయమైన చర్య ఇకపై జరిగితే క్షమించమని తెలియజేస్తూ.
మండల శాఖ అధ్యక్షులు సుద్దాల నరసయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నరసయ్య సుద్దాల మరియు లింగంపల్లి వెంకటి మరియు శ్రీకాంత్ అలాగే గంగరాజు అలాగే మహేష్ శ్రీకాంత్ లింగంపల్లి రాము మరియు తదితరులు రజక సంఘ సభ్యులు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది.

నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

కుమ్మర మల్లన్న జాతర లొ దాడిని నిరసిస్తూ నెక్కొండలో బహుజన సంఘాలు నెక్కొండ సాకలి ఐలమ్మ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు.
నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర గ్రామంలో జరిగిన కుమ్మర మల్లన్న జాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సందర్భంగా జాతరకు దైవదర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబంపై కొందరు దాడి చేసి దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపించారు.
బాధిత వర్గాల కథనం ప్రకారం, తాము ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, కుల దూషణలకు దిగారని తెలిపారు. అనంతరం జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసిందని, దాడిలో చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ ఘటనకు సంబంధించి కొందరు స్థానిక నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసులు ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలంటూ బాధిత కుటుంబం మరియు బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఎంఆర్‌పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య నెక్కొండ మండలంలో మాట్లాడుతూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల రజక సంఘం నాయకులు బొడ్డు పెళ్లి రాజ్ కుమార్, రామారావు రాము, అలాగే ఇతర కుల సంఘాల ప్రతినిధులు కూడా సంఘటనను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల దర్యాప్తు నివేదిక అనంతరం నిజానిజాలు వెలుగులోకి రానున్నాయని ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version